News February 5, 2025
బెల్లంపల్లి: మావోయిస్టుల లేఖ కలకలం

బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని పాత గనిని ఓపెన్కాస్ట్ చేసే ప్రయత్నాలను సింగరేణి విరమించుకోవాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ప్రకటనలో డిమాండ్ చేశారు. OCగా మారిస్తే పరిసర గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందన్నారు. శాంతిఖని ఓసీ నిలిపివేసేందుకు MLA వినోద్, MPవంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలన్నారు. లేకపోతే OCలు బొందలగడ్డగా మారుతాయన్నారు.
Similar News
News January 15, 2026
ఈ నెలాఖరు నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ఈ నెలాఖరు నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది. అయితే కాగ్నిజెంట్ వివిధ క్యాంపస్లలో పని చేస్తున్న దాదాపు 900 మందిని విశాఖకు బదిలీ చేశారు. మధురవాడ ఐటీ హిల్స్ సమీపంలో సొంత క్యాంపస్ కోసం 22 ఎకరాలు కేటాయించగా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మహతి బ్లాక్లో కార్యకలపాలు సాగిస్తోంది.
News January 15, 2026
తలసానిపై కేసు.. వివాదం ఏంటి?

TG: BRS సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన సికింద్రాబాద్లో జరిగిన ఓ ప్రోగ్రాంలో ‘సికింద్రాబాద్ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం’ అని CM రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రవి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR ఫైల్ చేశారు.
News January 15, 2026
MHBD: మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు ఇవే!

జిల్లాలో 4 మున్సిపాలిటీల రిజర్వేషన్ వివరాలు అధికారులు ప్రకటించారు. MHBD మున్సిపాలిటీలో ఎస్టీ 7,ఎస్సీ 5, జనరల్ మహిళ 10, జనరల్ 8, బీసీ 6 (మొత్తం 36), డోర్నకల్ ఎస్టీ 3, ఎస్సీ 4, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం15), మరిపెడ ఎస్టీ 6, ఎస్సీ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 (మొత్తం 15), తొర్రూరు ఎస్టీ 2, ఎస్సీ 3, జనరల్ మహిళ 5, జనరల్ 3, బీసీ 3 (16) కాగా, కేసముద్రం రిజర్వేషన్ రావాల్సి ఉంది.


