News February 8, 2025

బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

image

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 24, 2026

HYDలో ఇసుక బజార్ల ఏర్పాటుకు చర్యలు

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇసుక బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ఇసుక బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 4 ఇసుక బజార్లు ప్రారంభించబడ్డాయి. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మే నాటికి 6 కొత్త ఇసుక బజార్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇసుకను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి సహాయపడతాయి.

News February 24, 2026

కీరదోసలో గుమ్మడి పెంకు పురుగు – నివారణ

image

కీరదోస మొక్కలు మొలకెత్తిన తర్వాత గుమ్మడి పెంకు పురుగులు లేత ఆకులను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ సమయంలో ఈ పురుగుల నివారణకు ట్రైక్లోఫోరాన్‌ (5%) పొడిమందును చల్లాలి. 10 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. అలాగే తీగ పాకే సమయంలోనూ ఈ పెంకు పురుగులు పంటను ఆశించి ఆకులకు నష్టం కలిగిస్తాయి. అప్పుడు వాటి నివారణకు లీటరు నీటికి డైక్లోరోవాస్‌ 1.2ml లేదా ట్రైకోఫోరాన్‌ 2ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News February 24, 2026

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>ఇందిరాగాంధీ<<>> నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, M.Phil/NET/JRF, ఎంఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal.igntu.ac.in