News February 8, 2025
బెల్లంపల్లి రేంజ్లోనే పులి ఆవాసం!

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 18, 2025
TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
News November 18, 2025
TML: టోకెన్లు లేకుండా శ్రీనివాసుడి దర్శనం

తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి టీటీడీ ప్రాధాన్యమిచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఆఫ్లైన్ టోకెన్లను పూర్తిగా రద్దు చేసింది. కొండకు వచ్చిన వాళ్లు వచ్చినట్లు నేరుగా దర్శనానికి వెళ్లిపోవచ్చు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల్లో 182 గంటల పాటు ఉంటుంది. ఇందులో 164 గంటలు సామాన్య భక్తులనే అనుమతిస్తారు. ఇదే సమయంలో ఎక్కువ టైం షెడ్డుల్లో ఉంచకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.


