News February 8, 2025

బెల్లంపల్లి రేంజ్‌లోనే పులి ఆవాసం!

image

గత 10రోజులుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అటవీ ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలో పులి సంచరిస్తూ అడవి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం ఉదయం కాసిపేట మండలం వరిపేట గ్రామ సరిహద్దుల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపారు. అటవీ సమీప చేలల్లో పంటలు ఎలా కాపాడుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News November 13, 2025

సిరిసిల్ల జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా, అందులో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు, సీసీఐ ఆధ్వర్యంలో మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.

News November 13, 2025

తరగతులను కొత్త భవనంలో నిర్వహించాలి: కలెక్టర్

image

బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత, ఆటిజం కేంద్రాల స్థలాన్ని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. పాత భవన తరగతులను వారం రోజుల్లో కొత్త భవనంలోకి మార్చాలని ఆదేశించారు. ఆటిజం కేంద్రం కోసం గదుల కేటాయింపులు, పరికరాల కొనుగోలుపై సూచనలు ఇచ్చారు. విద్యార్థుల క్రమశిక్షణపై దృష్టి సారించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

News November 13, 2025

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం: విప్ ఆది శ్రీనివాస్

image

సిరిసిల్ల: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్లో చివరి గింజ కొనుగోలు వరకు అధికారులు రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025-26లో వరి, పత్తి, మక్కల కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు.