News February 7, 2025

బెల్లంపల్లి: రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కన్నాల బ్రిడ్జి కింద గుర్తు తెలియని రైలు బండికి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించామని రైల్వే ASIమోహన్ రాథోడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..మృతురాలి వయసు(30) సుమారుగా ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 15, 2025

KMR: ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గణితం 2బీ, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 5483 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 99 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1284 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 1246 మంది పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

News March 15, 2025

పెద్దపల్లి: నేడు 209 మంది గైర్హాజరు

image

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. గణితం B, జీవ శాస్త్రం, చరిత్ర పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 3895 విద్యార్థులకు గాను 3647 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 248 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 209 మంది, వొకేషనల్ 39మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.

News March 15, 2025

భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

image

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.

error: Content is protected !!