News March 28, 2025
బెల్లంపల్లి: రైలు పట్టాలపై వ్యక్తి మృతి

బెల్లంపల్లి పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలుకింద పడి మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎల్లో కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News October 17, 2025
ములుగు: నేడు వనం నుంచి జనంలోకి ఆశన్న!

మావోయిస్టు అగ్రనేత, సీసీ కమిటీ మెంబర్ తక్కళ్లపల్లి వాసుదేవరావు@ఆశన్న జనజీవన స్రవంతిలోకి రానున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన ఆశన్న 30 ఏళ్లుగా అడవిబాట పట్టి, అంచలంచెలుగా ఎదిగారు. కేంద్ర సరెండర్ పాలసీలో భాగంగా 170 మందితో నేడు ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో ఆయుధాలు అప్పజెప్పి లొంగిపోనున్నారు. సీఎం విష్ణుదేవ్ సాయి ఎదుట వీరంతా లొంగిపోయి వనం నుంచి జనంలోకి రానున్నారు.
News October 17, 2025
కేయూలో లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ

కేయూ బాటనీ విభాగం అధిపతితో పాటు నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, నలుగురు నాన్ టీచింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు జారీ చేసినట్లు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. ఇటీవల వీసీ ప్రతాప రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా ఆ విభాగ అధిపతితో సహా నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, మరో నలుగురు నాన్ టీచింగ్ ఉద్యోగులు విధుల్లో లేరనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News October 17, 2025
దీపావళి రోజు ఏం చేయాలంటే?

దీపావళి ముందురోజే ఇంటిల్లిపాది నూనెతో అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘పండుగరోజు ఉదయమూ తలస్నానం చేయాలి. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి దీపావళికి తప్పకుండా అమ్మవారిని పూజించాలి. సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేయాలి. దీపాలు వెలిగించి, అమ్మవారికి షడ్రుచులతో వంటకాలు నివేదించాలి. పూజ పూర్తయ్యాక ఆ దీపాలను ఇంటి ముందు, తులసి కోట వద్ద అలంకరించుకోవాలి’ అని చెబుతున్నారు.