News March 23, 2025

బెల్లంపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం కృషి: MLA

image

బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి అద్దాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల సంక్షేమానికి కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు.

Similar News

News October 15, 2025

NZB: మీ పశువులకు టీకాలు వేయించండి

image

జిల్లాలో గేదెలు, దూడలు, ఆవులు, లేగలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నేటి నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ రోహిత్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న 1.97 లక్షల పశువులకు ఏడో విడతలో భాగంగా నెల రోజుల పాటు గ్రామాల్లో ఉచితంగా టీకాలు వేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలని కోరారు.

News October 15, 2025

సిద్దిపేట: ఉచిత చేప పిల్లల కోసం ఎదురుచూపులు

image

మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతుంది. ఐతే ఈ ఏడాది చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచిన నేపథ్యంలో అవి ఎటూ తేలలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో చెరువులు, కుంటలు మొత్తం 1715 ఉన్నాయి. ఇక్కడ 10 కోట్ల చేప పిల్లలను వదలడంతో 50 వేల మంది ఉపాధి పొందనున్నారు.

News October 15, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో NOV 6 ఉ.7 గంటల నుంచి 11 సా. 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇది TV, రేడియో, పత్రికలు, SM, డిజిటల్ ప్లాట్‌ఫామ్ వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు/జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. కాగా NOV 11న పోలింగ్ జరగనుంది.