News March 1, 2025

బెల్లంపల్లి: హత్యాయత్నం కేసులో నలుగురి రిమాండ్

image

2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ CI అబ్జలుద్దీన్ తెలిపారు. చర్లపల్లి జంకాపూర్‌కు చెందిన మహేందర్‌పై సన్నీ, బానేశ్, ఆదిత్య, సాయి కత్తితో దాడి చేశారు. మొక్క జొన్న అమ్మకానికి గుడిసే ఏర్పాటు చేయకూడదని అతడిపై దాడి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News November 26, 2025

అరుణాచల్ మాదే.. నిజాన్ని మార్చలేరు: భారత్

image

అరుణాచల్ తమ భూభాగమేనన్న చైనా <<18386250>>ప్రకటనను<<>> భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. ‘భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం. ఇదే వాస్తవం. చైనా తిరస్కరించినా నిజం మారదు’ అని స్పష్టం చేశారు. షాంఘై ఎయిర్‌పోర్టులో భారత ప్రయాణికురాలిని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ రూల్స్‌, అన్ని దేశాల పౌరులకు 24hrs వీసా ఫ్రీ ట్రాన్సిట్ కల్పించే చైనా రూల్‌నూ అక్కడి అధికారులు పాటించలేదన్నారు.

News November 26, 2025

MHBD జిల్లాలో రెండవ విడతలో జరిగే ఎన్నికల వివరాలు

image

మహబూబాబాద్ జిల్లాలో MHBD, తొర్రూర్ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడతలో ఎన్నికల్లో బయ్యారం, చిన్నగూడూర్, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్ద వంగర, తొర్రూర్ మండలాల్లో 158 గ్రామ పంచాయతీల్లో, 1360 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడతలో డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30 నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది.

News November 26, 2025

MHBD జిల్లాలో రెండవ విడతలో జరిగే ఎన్నికల వివరాలు

image

మహబూబాబాద్ జిల్లాలో MHBD, తొర్రూర్ డివిజన్ పరిధిలో మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడతలో ఎన్నికల్లో బయ్యారం, చిన్నగూడూర్, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్ద వంగర, తొర్రూర్ మండలాల్లో 158 గ్రామ పంచాయతీల్లో, 1360 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండవ విడతలో డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30 నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది.