News February 2, 2025
బెల్లంపల్లి: 3 రోజులుగా ఆ పరిసరాల్లోనే పెద్దపులి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు బుగ్గగూడెం పరిసర అటవీ ప్రాంతాల్లో గత 3రోజులుగా పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారి పూర్ణచందర్ తెలిపారు. పులి జాడ తెలుసుకునేందుకు 5చోట్ల కెమెరాలు అమర్చినట్లు అధికారి వివరించారు. కానీ కెమెరాల్లో పెద్దపులి చిక్కలేదని వివరించారు. కాగా ఆదివారం ఉదయం పులి తిరుగుతున్న పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News November 26, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికలపై సన్నద్ధత

నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 26, 2025
NGKL: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి: కలెక్టర్

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ సంతోష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించాలని, 5000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలలో రూ.2.5 లక్షలు సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు చేయాలని, వార్డు సభ్యులు రూ.50,000 ఖర్చు చేయాలనే సూచించారు.
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.


