News February 2, 2025
బెల్లంపల్లి: 3 రోజులుగా ఆ పరిసరాల్లోనే పెద్దపులి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు బుగ్గగూడెం పరిసర అటవీ ప్రాంతాల్లో గత 3రోజులుగా పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారి పూర్ణచందర్ తెలిపారు. పులి జాడ తెలుసుకునేందుకు 5చోట్ల కెమెరాలు అమర్చినట్లు అధికారి వివరించారు. కానీ కెమెరాల్లో పెద్దపులి చిక్కలేదని వివరించారు. కాగా ఆదివారం ఉదయం పులి తిరుగుతున్న పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు.
News November 18, 2025
ఇవాళ్టి నుంచే అబుదాబి T10 లీగ్

ఇవాళ్టి నుంచి అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా T10 లీగ్ ప్రారంభంకానుంది. 12 రోజులు జరగనున్న ఈ టోర్నీలో 8 టీమ్స్ 32 మ్యాచులు ఆడనున్నాయి. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్ సారథ్యంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగనుంది. టీమ్ ఇండియా మాజీ స్టార్స్ హర్భజన్ సింగ్, మురళీ విజయ్, పీయూష్ చావ్లా వంటివారు కూడా ఈ లీగ్లో భాగం కానున్నారు.
News November 18, 2025
మహబూబాబాద్: తండ్రి కళ్ల ముందే కొడుకు ప్రాణం విలవిల..!

తన కళ్ల ముందే తన కొడుకు విలవిల కొట్టుకుంటూ చనిపోతుంటే ఆ తండ్రి పడే బాధ వర్ణనాతీతం. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబాబాద్(D) తొర్రూర్(M) పోలేపల్లికి చెందిన ధరావత్ వనిత, విశ్వనాథ్ దంపతుల కుమారుడు రామ్చరణ్(17). తమ పొలంలో వడ్లు తెచ్చేందుకు తండ్రి నడుపుతున్న ట్రాక్టర్పై కూర్చొని రామ్చరణ్ వెళ్లాడు. గట్టు ఎక్కిస్తున్న క్రమంలో ట్రాలీలో ఉన్న రామ్చరణ్ కింద పడగా అతడిపై నుంచి చక్రం వెళ్లడంతో చనిపోయాడు.


