News February 3, 2025
బెల్లంపల్లి: 4 రోజులుగా అక్కడే పులి నివాసం!

గత 4 రోజులుగా బెంబేలెత్తిస్తున్న పెద్దపులి బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం బుగ్గగూడెం అటవీ ప్రాంతంలోనే తిష్ట వేసింది. సోమవారం FRO పూర్ణచందర్ మాట్లాడుతూ..బుగ్గగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలో పెద్దపులి కదలికలు రికార్డు అయ్యాయన్నారు. పులి స్థావరం సురక్షితంగా ఉండడంతోనే గత 4 రోజులుగా ఒకే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుగ్గ రహదారిలో ప్రజలెవరు వెళ్లకూడదని హెచ్చరించారు.
Similar News
News September 16, 2025
WNP: ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

టీజీఎస్ ఆర్టీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రారంభించిన ‘యాత్ర దానం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు బస్సులను బుక్ చేసుకుని ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు.
News September 16, 2025
హుస్నాబాద్: రజకుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

రజక వృత్తిదారుల సమస్యలు CM దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రజక అభివృద్ధి దారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కుల వృత్తులపై ఆధారపడే బలహీన వర్గాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
రక్షణ శాఖ మంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం పికెట్ గార్డెన్లో అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.