News February 21, 2025

బెల్లంపల్లి: FEB 23న TG CET

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఈనెల 23 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకొని రావాలని సూచించారు.

Similar News

News November 21, 2025

పల్నాడు: కాలువల మరమ్మతులలో నిధుల దుర్వివినియోగం

image

పల్నాడు ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మేజర్, మైనర్ కాలువల మరమ్మతులలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. అధికారుల సహాయంతో కొందరు నేతలు కాలువలకు మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. రైతుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

News November 21, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు US పీస్ ప్లాన్!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు US ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి US 28 పాయింట్లతో కూడిన పీస్ ప్లాన్‌ను అందజేసింది. ఉక్రెయిన్ తన తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని వదులుకోవడం, సాయుధ దళాల పరిమాణాన్ని తగ్గించుకోవడం వంటివి అందులో ఉన్నట్లు సమాచారం. తన ప్రమేయం లేకుండా రూపొందించిన ఈ ప్లాన్‌పై జెలెన్ స్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ట్రంప్‌తో చర్చించే ఛాన్సుంది.

News November 21, 2025

ఖమ్మం: ఆర్వో ప్లాంట్ల దందా.. ప్రజారోగ్యానికి ముప్పు

image

ఖమ్మం జిల్లాలోని అనేక ఆర్వో వాటర్ ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. పరిశుభ్రత పాటించకపోవడంతో నీటిలో ఈ-కోలీ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. అధికారుల నిఘా లోపం, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.