News February 21, 2025

బెల్లంపల్లి: FEB 23న TG CET

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం నిర్వహించే అర్హత పరీక్ష ఈనెల 23 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్, పరీక్ష ప్యాడ్ తీసుకొని రావాలని సూచించారు.

Similar News

News November 27, 2025

నారాయణపేట జిల్లాలో 69 సర్పంచ్ నామినేషన్లు

image

నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం 67 గ్రామ పంచాయతీలకు గాను, సర్పంచ్ పదవులకు 69 నామినేషన్లు, 572 వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కొత్తపల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 26 నామినేషన్లు రాగా.. వార్డులకు 8 నామినేషన్లు వచ్చాయి. కోస్గిలో 19, 25, మద్దూరులో 16, 4, గుండుమల్‌లో 8, 1.. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత

image

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో సమావేశం అయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు రెండేళ్ల కింద నోటికి ఏదీ వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం కనబడకుండా పోయారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనబడని పరిస్థితి ఉందన్నారు.