News March 18, 2025
బెల్లంపల్లి: KU డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి: శంకర్

బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ శంకర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోఆర్డినేటర్ MD.రఫీ తెలిపారు. కళాశాలలో BA, Bcom, Bscచదువుతున్న 2వ,4వ,6వ సెమిస్టర్ విద్యార్థులు ఈ మేరకు నిర్ణయించిన ఫీజులు ఆన్ లైన్లో చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు కాకతీయ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించిందన్నారు.
Similar News
News April 23, 2025
చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సీఎంతో పాటు ఎమ్మెల్యే గణబాబు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, పలువురు కూటమి నాయకులు ఉన్నారు.
News April 23, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ జిల్లాలో టెన్త్ టాపర్స్ను అభినందించిన కలెక్టర్ ☞ అమరావతిలో ఉగ్ర దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ ☞ పిడుగురాళ్లలో సందడి చేసిన హీరోయిన్ మెహరీన్ ☞ సత్తనపల్లిలో పోలీసుల తనిఖీలు ☞ నకరికల్లు పోలీస్ స్టేషను తనిఖీ చేసిన ఎస్పీ ☞ పెద్దకూరపాడులో యువకుడిపై దాడి
News April 23, 2025
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా

ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా ఆయన అవతరించారు. హైదరాబాద్తో మ్యాచులో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్సుల్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ నిలిచారు. అగ్ర స్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచుల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు.