News April 11, 2025
బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు 3వసారి మనకే..!

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్ ఫణికర్ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.
Similar News
News December 6, 2025
గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.
News December 6, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్లైన్స్కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.
News December 6, 2025
అమలాపురం: అంబేడ్కర్కు నివాళులర్పించిన కలెక్టర్

సంఘటిత భారతదేశానికి అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే పునాది అని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. శనివారం అమలాపురంలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ముఖ్యంగా యువత ఆయన బోధనలు, ఆశయాలను తప్పక ఆచరించాలని కలెక్టర్ సూచించారు.


