News April 11, 2025

బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ అవార్డు 3వసారి మనకే..!

image

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్‌ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా విభాగంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్‌ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్‌ ఫణికర్‌ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.

Similar News

News November 15, 2025

విజయవాడ: లవర్ బాయ్ మోసం.. పట్టుకున్న పోలీసులు

image

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి విజయవాడ బస్టాండ్ వద్ద ఏడుస్తూ ఉండగా కృష్ణలంక పోలీసులు ఆరా తీశారు. తాను శ్రీకాకుళం పట్టణానికి చెందిన మరో యువకుడితో కలిసి విజయవాడలో పెళ్లి చేసుకుందామని వచ్చామని తెలిపింది. యువకుడు తన వద్ద ఉన్న బంగారం, ఫోన్, నగదు తీసుకొని పారిపోయాడని వాపోయింది. వెంటనే పోలీసులు సాంకేతిక ప్రరిజ్ఞానంతో యువకుడు ఎక్కడున్నాడో తెలుసుకొని అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News November 15, 2025

జగిత్యాల: ‘ఈ నెల 30లోపు గణన పూర్తి చేయాలి’

image

జగిత్యాల కలెక్టరేట్‌లో 7వ చిన్నతరహా నీటి వనరుల గణన (2023-24), రెండో జలాశయాల గణనపై జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ బి.యస్. లత అధ్యక్షత వహించారు. ప్రధాన ప్రణాళిక అధికారి గుగ్గిళ్ల సత్యం గణన పూర్తిగా డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించబడుతుందని, జూన్ 30 నాటికి గ్రామాలన్నింటిలో భూగర్భ, ఉపరితల జల వనరుల వివరాలు సేకరించాలని సూచించారు. ఈ నెల 30లోపు గణన పూర్తి చేయాలని మాట్లాడారు.

News November 15, 2025

భద్రాద్రి: లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. నేటి స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం అయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కాదగిన కేసులను కక్షిదారులు సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించారు.