News April 11, 2025
బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డు 3వసారి మనకే..!

GMR శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ 2025 అవార్డును నాలుగోసారి కంపెనీ CEO ప్రదీప్ ఫణికర్ అందుకున్నారు. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.
Similar News
News October 25, 2025
ఏఐ ఫేక్ వీడియో, ఇమేజ్లపై ECI ఆదేశాలు

బిహార్ ఎన్నికల్లో AIవీడియోలు, ఇమేజ్లతో ప్రచారాలు మిన్నంటాయి. వీటిలో కొన్ని ఓటర్లను తప్పుదోవ పట్టించేలా ఉండటంతో EC కొత్త రూల్స్ ప్రకటించింది. వీడియో, ఇమేజ్ల పైభాగంలో స్పష్టమైన లేబుల్ ఉండాలి. తయారీదారు పేరుండాలి. అవమానపరిచేలా, అనుమతిలేని ఇతరుల స్వరాలు, స్వరూపాలతో ఆడియో, వీడియోలు ప్రచారం చేయరాదు. తప్పుడు కంటెంట్ ఉంటే 3గం.లో హ్యాండిళ్ల నుంచి తొలగిస్తారు. పార్టీలు వీటిపై రికార్డులు నిర్వహించాలి.
News October 25, 2025
ఈ నెల 30న జాబ్ మేళా: కలెక్టర్

ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం జాబ్ మేళా పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పొన్నూరు రోడ్ ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఇంటర్వూలు నిర్వహిస్తారన్నారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని 935 ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ గుడ్ న్యూస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
News October 25, 2025
విశాఖ: భారీ తుఫాను ముప్పు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారనుంది. ఇది అక్టోబర్ 27 నాటికి తుఫానుగా బలపడి, అక్టోబర్ 29న మచిలీపట్నం-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల మేరకు, తీరం దాటే సమయంలో భారీ వర్షాలు, పెనుగాలులు వీచే అవకాశం ఉంది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.


