News February 10, 2025

బేగంపేట: సైబర్ క్రైమ్‌పై స్పెషల్ ఫోకస్

image

సైబరాబాద్ పోలీస్ అధికారుల బృందం సైబర్ క్రైమ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రోజురోజుకు యమగండంగా మారుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడమే దీనికి ఉన్నత మార్గంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా బేగంపేట ప్రాంతంలోని ఎయిర్ఫోర్స్ అధికారులకు సైతం అవగాహన కల్పించినట్లు పేర్కొంది. సైబర్ నేరాల్లో విద్యావంతులే అధిక శాతం ఉన్నట్లు పలు కేసుల విచారణలో తేలింది.

Similar News

News November 24, 2025

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనని పెద్దపల్లి ఎంపీ

image

పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరు కాలేదు. గతంలో కాళేశ్వరం పుష్కరాలు, ఈఎస్ఐ ఆసుపత్రి కార్యక్రమాల్లోనూ ఎంపీని పక్కనపెట్టిన ఘటనలు ఉన్న నేపథ్యంలో, తాజా పరిణామం ఎమ్మెల్యేలు-ఎంపీ మధ్య సమన్వయ లోపాన్ని మరింత స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొనకపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

News November 24, 2025

విజేతలుగా కడప జిల్లా టీంలు

image

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.

News November 24, 2025

రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

image

హైదరాబాద్‌లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్‌పై ఈ రైడ్స్ జరిగాయి.