News February 10, 2025
బేగంపేట: సైబర్ క్రైమ్పై స్పెషల్ ఫోకస్

సైబరాబాద్ పోలీస్ అధికారుల బృందం సైబర్ క్రైమ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రోజురోజుకు యమగండంగా మారుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడమే దీనికి ఉన్నత మార్గంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా బేగంపేట ప్రాంతంలోని ఎయిర్ఫోర్స్ అధికారులకు సైతం అవగాహన కల్పించినట్లు పేర్కొంది. సైబర్ నేరాల్లో విద్యావంతులే అధిక శాతం ఉన్నట్లు పలు కేసుల విచారణలో తేలింది.
Similar News
News December 4, 2025
SIM Bindingపై ఓటీటీలు, యాప్స్ అసంతృప్తి

OTTలు, వాట్సాప్ వంటి యాప్స్ పని చేయాలంటే ఫోన్లో యాక్టివ్ SIM ఉండాలన్న <<18424391>>DoT ఆదేశాలపై<<>> బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరమ్(BIF) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అమలును నిలిపేయాలని, యూజర్లపై ప్రభావాన్ని అంచనా వేయకుండా ఉత్తర్వులివ్వడం సరికాదని పేర్కొంది. టెలికాం కంపెనీలు మాత్రం DoTని అభినందించాయి. SIM Bindingతో యూజర్, నంబర్, డివైజ్ మధ్య నమ్మకమైన లింక్ ఉంటుందని, స్పామ్, ఆర్థిక మోసాలను తగ్గించవచ్చని అన్నాయి.
News December 4, 2025
MBNR: గుర్తులొచ్చాయ్.. ప్రచారం షురూ

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సమరం జోరందుకుంది. తొలి, రెండో విడత నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉదయం 6 గంటలకే మొదలుపెడుతున్నారు. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న నిర్వహించనున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఎలక్షన్ అధికారులు ఇప్పటికే గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో మునిగిపోయారు.
News December 4, 2025
సిరిసిల్ల: తొలి విడతలో 229 వార్డులు ఏకగ్రీవం

జిల్లాలో తొలివిడత ఎన్నికలకు సంబంధించి ఐదు మండలాల్లో 748 వార్డులకు గాను 229 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 519 వార్డుల్లో 1,377 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. రుద్రంగిలో 91, వేములవాడ అర్బన్ 218, వేములవాడ రూరల్ 262, కోనరావుపేట 459, చందుర్తి మండలంలో 347 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీన దీనికి సంబంధించి పోలింగ్ నిర్వహిస్తారు.


