News February 10, 2025
బేగంపేట: సైబర్ క్రైమ్పై స్పెషల్ ఫోకస్

సైబరాబాద్ పోలీస్ అధికారుల బృందం సైబర్ క్రైమ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రోజురోజుకు యమగండంగా మారుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడమే దీనికి ఉన్నత మార్గంగా ఎంచుకుంది. ఇందులో భాగంగా బేగంపేట ప్రాంతంలోని ఎయిర్ఫోర్స్ అధికారులకు సైతం అవగాహన కల్పించినట్లు పేర్కొంది. సైబర్ నేరాల్లో విద్యావంతులే అధిక శాతం ఉన్నట్లు పలు కేసుల విచారణలో తేలింది.
Similar News
News March 17, 2025
జగిత్యాల: ప్రతి ఫిర్యాదును ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం: ఎస్పీ

జగిత్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది వివిధ సమస్యలపై ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు లేఖలను ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
News March 17, 2025
చైతూ జ్ఞాపకాలను చెరిపేస్తున్న సమంత!

నాగచైతన్యతో విడిపోయిన సమంత ఒక్కొక్కటిగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను చెరిపేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ రింగ్లోని డైమండ్ను లాకెట్గా మార్చుకున్న సామ్ చైతూతో కలిసి వేయించుకున్న టాటూను తొలగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆమె పోస్టు చేసిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన జీవితంలోని చేదు అనుభవాల నుంచి బయటకొచ్చేందుకు ఆమె ఇలా చేస్తున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
News March 17, 2025
HYDలో విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపం ఉన్నవారికి కంటి అద్దాలు అందిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 71,309 మంది విద్యార్థుల్లో 8,849 మందికి కంటి సమస్యలు గుర్తించారు. 7,524 మందికి పునఃపరీక్షలు నిర్వహించి నాణ్యమైన కంటి అద్దాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మొబైల్, టీవీ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.