News March 20, 2024

బైండోవర్ కేసుల నమోదుకు పోలీసుల సన్నద్ధం: ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నాయకులు, కార్యకర్తలు, అనుమానిత వ్యక్తులు, నేరచరిత్రుల గుర్తించేందుకు పోలీసు అధికారులు కసరత్తు చేపట్టారు. సదరు వ్యక్తులను గుర్తించి ఐపీసీ106, 107, 108, 109, 110 కింద కేసు నమోదు చేసిన తర్వాత తహశీల్దారు ఎదుట హాజరుపరచనున్నారు.

Similar News

News October 24, 2025

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును జిల్లా పోలీసు అధికారులు మంత్రులకు వివరించారు. మంత్రులతో పాటు డీజీపీ హరీశ్, డీఐజీ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు ఉన్నారు.

News October 24, 2025

కర్నూలు: ALL THE BEST సాదియా

image

పంచలింగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరగబోయే 69వ రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాఠశాల చెందిన సాదియా తబస్సుమ్ 48 కేజీల వెయిట్ కేటగిరిలో పాల్గొంటున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు మాలిక్ తెలిపారు.

News October 24, 2025

తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించండి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, హెచ్ఎన్ఎస్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.