News March 1, 2025

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. ఒకరి మృతి

image

అమరాపురం మండలం ఉదుగూరు గ్రామం వద్ద బైక్‌ను ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. అగ్రహారానికి చెందిన జగదీశ్ తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీశ్ మృతిచెందగా మంజునాథ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.

Similar News

News December 1, 2025

భూపాలపల్లి: మొదటి రోజు అంతంత మాత్రంగానే నామినేషన్లు

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్లు మొదటి రోజు (ఆదివారం) అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. సర్పంచ్‌లకు భూపాలపల్లిలో 3, చిట్యాలలో 20, టేకుమట్లలో 16, పలిమెలలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డులకు భూపాలపల్లిలో 1, చిట్యాలలో 19, టేకుమట్లలో 4, పలిమెలలో 4 నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 1, 2025

ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

image

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.

News December 1, 2025

MHBD: నేటి నుంచి కొత్త వైన్ షాపుల ప్రారంభం

image

జిల్లాలో 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం మొత్తం 61 వైన్ షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సులు కేటాయించారు. ఇందులో మహబూబాబాద్-27, తొర్రూర్-22, గూడూరు-12 ఎక్సైజ్ శాఖ పరిధిలో 61 షాపులు నిర్వహిస్తున్నారు. డ్రాలో ఎంపికైన నూతన నిర్వాహకులకు అధికారులు లైసెన్సులు అందజేయడంతో వారు సోమవారం నుండి కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.