News April 24, 2024

బై‌క్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి

image

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.

Similar News

News December 21, 2025

ప్రకాశం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?

News December 21, 2025

ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్.!

image

పాఠశాల రికార్డుల్లో విద్యార్థుల సంఖ్య తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. సంతనూతలపాడు మండలం మంగమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విధుల్లో ఉండగా.. ఇటీవల RJD పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య రికార్డుల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాగా RJD వివరణతో అతణ్ని సస్పెండ్ చేసినట్లు DEO తెలిపారు.

News December 21, 2025

కనిగిరిలో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం

image

కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం రైల్వే శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. వెనుకబడిన కనిగిరి ప్రాంతానికి రైల్వే శాఖ సేవలు అందుబాటులోకి రావటం వలన ఈ ప్రాంత ప్రజలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. పనులు వేగవంతమైనట్లు అధికారులు తెలిపారు.