News April 24, 2024
బైక్పై నామినేషన్కు బయలుదేరిన ఏలూరి

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.
Similar News
News December 13, 2025
ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
News December 13, 2025
ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
News December 13, 2025
ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.


