News February 24, 2025
బైక్ అదుపుతప్పి మందమర్రి వాసి మృతి

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫ్లైఓవర్ పైన బైక్ అదుపుతప్పి KK-OCPలారీ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..షేక్ ముగ్ధం, షేక్ జిలాని ఇద్దరు అన్నదమ్ములు బైకుపై మంచిర్యాల వెళ్లి వారి మేనమామ ఇంటికి బెల్లం పల్లికి వెళుతుండగా మందమర్రి ఫ్లై ఓవర్ పైన జిలాని డ్రైవింగ్ చేస్తూ డివైడర్ను ఢీకొట్టాడు. జిలాని అక్కడికక్కడే మృతి చెందాడు. మగ్గంకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 6, 2025
సూర్యాపేట: ఎన్నికల ఫిర్యాదులకు ఐఏఎస్ అధికారి ప్రత్యేక నంబర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి రవి నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల ఉల్లంఘనలు లేదా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి ఆయన ఒక ప్రత్యేక ఫోన్ నంబర్ను ప్రకటించారు. 9676845846 జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News December 6, 2025
VKB: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. అధికారి సస్పెండ్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విధులకు గైర్హాజరైనా ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్షన్ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులు సమర్థవంతంగా, సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 6, 2025
విజయనగరం: పెన్షన్ దారులకు అలర్ట్.!

జిల్లాలో కుటుంబ పెన్షన్ దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి నాగ మహేశ్ శనివారం తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025లో సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్లు 2026కి చెల్లవని, ఇప్పటికే సమర్పించినవారు మళ్లీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఉప ఖజానా కార్యాలయాల్లో సర్టిఫికెట్లు సమర్పించవచ్చని తెలిపారు.


