News March 27, 2025

బైరెడ్డికి పదవి.. వైసీపీ శ్రేణుల హర్షం

image

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంతో సిద్ధార్థ్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘నాపై నమ్మకంతో మరో బాధ్యత ఇచ్చిన జగన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ బైరెడ్డి ట్వీట్ చేశారు.

Similar News

News April 2, 2025

కర్నూలు: TODAY TOP NEWS

image

➤ రేపు కర్నూలుకు YS జగన్ రాక➤ కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ➤ బీటీ నాయుడు ప్రమాణ స్వీకారానికి మంత్రాలయం నేతలు➤ ఎమ్మిగనూరు గాంధీ నగర్‌లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం➤ కర్నూలు జిల్లాకు వర్ష సూచన➤ కర్నూలు: నకిలీ డాక్యుమెంట్లతో కోట్లు స్వాహా➤ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసనలు➤ నంది అవార్డు గ్రహీతకు ఆదోని DSP అభినందన ➤గోనెగండ్లలో పర్యటించిన సబ్ కలెక్టర్

News April 2, 2025

క‌ర్నూలు- విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులపై చ‌ర్చించిన మంత్రి టీజీ

image

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యంపై చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పార‌ని టి.జి భరత్ పేర్కొన్నారు.

News April 2, 2025

రేపు కర్నూలుకు YS జగన్ రాక.!

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు రానున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11:45కు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో జరిగే కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కూతురి వివాహా కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో జగన్ రాకకు జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

error: Content is protected !!