News January 30, 2025
బైరెడ్డిపల్లిలో విషాదం

చిన్నారి మృతి చెందిన ఘటన బైరెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. T.N.కుప్పం గ్రామానికి చెందిన రాజేశ్, రూప దంపతుల కుమార్తె వైష్ణవి(10) కి జ్వరం రావడంతో ఇద్దరు RMP డాక్టర్ల వద్ద చూపించారు. రెండు రోజులైన జ్వరం తగ్గకపోవడంతో పలమనేరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆమె ఆరోగ్యం క్షిణించిందని వైద్యులు సూచించారు. పెద్దాసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది.
Similar News
News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2025
చిత్తూరు: 27 మంది సచివాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు

27 మంది సచివాలయం సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం ఆదేశించారు. అనధికారికంగా సెలవుపై ఉండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. మెడికల్ లీవ్లో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డులో పరీక్షల నిర్వహించి, తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2025
చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్కు మస్త్

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.


