News June 6, 2024

బైరెడ్డిపల్లి: నలుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు

image

పాతపేటలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు వైసీపీ సర్పంచ్ మమత భర్త రవిచంద్రపై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. విజయోత్సవ సంబరాల్లో పేల్చిన టపాకాయలు రవిచంద్ర ఇంటి వద్ద అతని కుమార్తె, సోదరుని కుమారుడిపై పడి గాయపడినట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. చిన్నారులకు గాయాలయ్యేలా టపాకాయలు ఎందుకు కాల్చారని ప్రశ్నించడంపై దాడి చేశారని ఆరోపించారన్నారు.

Similar News

News October 28, 2025

అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోండి: కలెక్టర్

image

తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సుమిత్ కుమార్ తెలిపారు. దీనిపై ఎటువంటి పుకార్లను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. వార్తా సమాచారం కోసం ఫోన్లలో గమనిస్తూ ఉండాలని కోరారు. అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.

News October 28, 2025

చిత్తూరు జిల్లాలో నేడు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

News October 27, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా స్కూళ్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలో అన్ని స్కూళ్లకు మంగళవారం సైతం సెలవును ప్రకటించినట్లు DEO వరలక్ష్మి తెలిపారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు గమనించాలని కోరారు.