News April 5, 2025
బొండపల్లి: ఆన్లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 7, 2025
వినతులు స్వీకరించనున్న మంత్రి కొండపల్లి

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాకు చెందిన ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను విడతల వారీగా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.
News April 6, 2025
రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామతీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
News April 5, 2025
VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.