News January 21, 2025
బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత<<15209881>> కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో నిందితుడికి, సాక్షులకు తేడా మాజీ మంత్రికి తెలియడం లేదన్నారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
Similar News
News February 16, 2025
విశాఖలో IPL.. మ్యాచ్లు ఎప్పుడంటే..?

IPL అంటేనే అదొక మజా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి నేరుగా మ్యాచ్ చూడలేని వాళ్లు టీవీలు, మొబైల్లో ఐపీఎల్ను ఆస్వాదిస్తారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్లను ఈ సీజన్లో విశాఖ ప్రజలు నేరుగా చూడవచ్చు. ఢిల్లీ జట్టు విశాఖ స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్గా ఎంచుకోవడంతో ఇక్కడ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 24న లక్నోతో, 30న సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ తలపడనుంది.
News February 16, 2025
రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 16, 2025
నెల జీతం విరాళంగా ఇచ్చిన విజయనగరం ఎంపీ

తలసేమియాతో బాధపడుతున్న రోగుల చికిత్స నిమిత్తం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. విజయవాడలో తలసేమియా రోగుల కోసం శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఏడాది రోగుల కోసం తన వంతుగా ఒక నెల జీతాన్ని అందజేస్తానని ఎంపీ తెలిపారు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ ట్రస్టుకు జమచేస్తానని వెల్లడించారు.