News August 11, 2024
బొత్స నామినేషన్కు డేట్ ఫిక్స్..!

విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 నుంచి నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. స్వీకరణకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బొత్స తన నామినేషన్ పత్రాలను సోమవారం సమర్పిస్తారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా కూటమి నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు.
Similar News
News January 9, 2026
VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి’

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కనీసం 80% పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
News January 9, 2026
VZM: ‘పీహెచ్సీల్లో వైద్యసేవలు మెరుగుపడాలి’

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మెరుగుపరిచి ఓపిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్య సేవలపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫరెన్స్తో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వేపైనా చర్చించారు. పీహెచ్సీల వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాలని ఆదేశించారు.
News January 8, 2026
నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్ఎస్లో వివరాల అప్లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.


