News March 24, 2024

బొబ్బిలి: పవన్‌ను కలిసిన రంగారావు

image

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మతో పాటు మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. 

Similar News

News November 18, 2025

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

News November 18, 2025

విజయనగరంలో ఈనెల 20న జాబ్ మేళా

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీద సోమవారం తెలిపారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ATC టైర్స్, మెడ్ ప్లస్ సంస్థలలో కలిపి 195 పోస్టులు భర్తీ చేయనున్నారని, అభ్యర్థులు ముందుగా employment.ap.gov.inలో నమోదు చేసుకుని, సర్టిఫికెట్లు, బయోడేటా, 2 ఫొటోలతో జాబ్ మేళాకు హాజరవ్వాలన్నారు. డిగ్రీ, పీజీ, ANM, GNM, ఫార్మసీ, ఐటీఐ, SSC చదివిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

News November 18, 2025

మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలు అందించండి: VZM SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘ఓ ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోమ్‌లకు తరలించి చికిత్స అందించనున్నట్లు చెప్పారు.