News May 24, 2024
బొబ్బిలి: హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య

బొబ్బిలి మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన కవిటి నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News February 19, 2025
గజపతినగరంలో వ్యక్తి అరెస్టు

ఓ చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. విజయనగరంలోని ఓ ట్రాన్స్ పోర్ట్ చిట్ ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయిరామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించకపోవడంతో విజయనగరం సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.
News February 19, 2025
పాలకొండ రానున్న వైఎస్ జగన్

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పాలకొండ రాబోతున్నట్లు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మంగళవారం తెలిపారు. ఇటీవల మరణించిన వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని జగన్ పరామర్శించినున్నట్లు వారు వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారని.. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్స్లర్కి విశాఖతో అనుబంధమిదే..!

ఏయూ వైస్-చాన్సలర్గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.