News March 13, 2025
బొమ్మలరామారంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎల్లో అలర్ట్ జారీ

యాదాద్రి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు పెరిగింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Similar News
News November 17, 2025
మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.
News November 17, 2025
మహిళా పోలీసులకు ‘షి-లీడ్స్’ శిక్షణ ప్రారంభం

మహిళా పోలీసులు ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సంఘటనలను ఎదుర్కొనేలా వినూత్నమైన ‘షి-లీడ్స్’ శిక్షణను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు. ధర్నాలు, నిరసనలలో, ముఖ్యంగా మహిళా నిరసనకారులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ శిక్షణలో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. మహిళా పోలీసుల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందని సీపీ తెలిపారు.
News November 17, 2025
చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.


