News March 13, 2025

బొమ్మలరామారంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎల్లో అలర్ట్ జారీ

image

యాదాద్రి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు 36 నుంచి 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు పెరిగింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బొమ్మలరామారం మండలంలో బుధవారం 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Similar News

News October 19, 2025

MLAనూ వదల్లేదు.. రూ.1.07 కోట్లు దోపిడీ

image

AP: డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. TDPకి చెందిన ఓ MLA సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు MLA డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన HYD క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 19, 2025

‘రబీలో 1,07,503 హెక్టార్లు సాగులోకి రావొచ్చు’

image

రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పప్పుశనగ 65,017 హెక్టార్లు, నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7888 హెక్టార్లు, వరి 6069, జొన్న 4919, ఉలవ 1377, పొద్దుతిరుగుడు 1230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చన్నారు. గతేడాది రబీలో సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 హెక్టార్లు తగ్గవచ్చన్నారు.

News October 19, 2025

గుంతకల్లు: రైళ్లకు అదనపు బోగీలు జోడింపు

image

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణాల రద్దీ దృష్ట్యా అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా పలు రైళ్లకు అదనపు బోగీలు జోడిస్తున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు తెలిపారు. కలబుర్గి – బెంగళూరు రైలు 06208 అక్టోబర్ 21న, ఫర్నగర్బెం – గలూరు రైలు 06262 అక్టోబర్ 24న గుంతకల్లు మీదుగా అదనపు బోగీలతో నడుస్తుందని వివరించారు.