News February 20, 2025

బొల్లారంలో పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

వీపనగండ్ల మండలం బొల్లారంలో శ్రీనివాస్ గౌడ్(50) మల్లయ్య గుట్ట వద్ద పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుని మరణించినట్లు గ్రామస్థులు తెలిపారు. జంగలయ్య గౌడ్ అంత్యక్రియలకు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన ఆస్తుల విషయంలో తండ్రి నాగేంద్రం గౌడ్‌తో గొడవపడి ఆత్మహత్య పాల్పడినట్లు పేర్కొన్నారు. కేసు నమోదైంది.

Similar News

News March 21, 2025

బ్రాహ్మణుడు లేని ఆదర్శ వివాహాలు జరగాలి: యాదగిరి

image

సమాజంలో ఆదర్శ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు మరిన్ని జరగాలని పాశం యాదగిరి, పలవురు వక్తలు అభిప్రాయపడ్డారు. SVKలో నాగర్‌కర్నూల్‌కు చెందిన వెంకటేశ్ (ఎస్సీ) మంచిర్యాలకు చెందిన హారిక (ఎస్టీ) ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షతన బ్రాహ్మణుడు, మంత్రాలులేని ఆదర్శ వివాహం జరిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాట పాడి అలరించారు.

News March 21, 2025

మహబూబ్‌నగర్‌లో వ్యక్తి మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. న్యూటన్ అమృత ప్రైవేట్ హాస్పిటల్ గల్లీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని MBNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

News March 21, 2025

మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్

image

నెలాఖరులోపు మినీ గోకులాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి వివరించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఫార్మ్ ఫండ్ ఏర్పాట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతి, గోకులంల నిర్మాణాల పురోగతిపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1200 లక్ష్యానికి 664 పూర్తి చేసామని కలెక్టర్ వివరించారు.

error: Content is protected !!