News May 20, 2024
బోథ్లో 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు SI రాము తెలిపారు. బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయం వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News February 24, 2026
జూడోలో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుల విజయం

సీఎం కప్ 2025-26 జూడోలో ఆదిలాబాద్ క్రీడాకారుల విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన పతకాలు సాధించిన విజేతలను ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూడో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
News February 24, 2026
ADB: 108 సిబ్బంది సేవలు అభినందనీయం

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కనపర్తి చంద్రకాంత్, కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


