News June 12, 2024

బోథ్ మండలంలో చిరుతపులి సంచారం?

image

ఓ వాహనదారుడికి చిరుతపులి కనిపించిన ఘటన మండలంలో జరిగింది. వివరాలిలా.. బోథ్‌కు చెందిన ఓ యువకుడు మంగళవారం రాత్రి జీడిపల్లె మీదుగా సొనాలకు వెళ్తున్నాడు. జీడిపల్ల-టివిటి గ్రామాల మధ్య నీటి కుంట సమీపంలోని వంతెన వద్ద చిరుతపులి చూసినట్లు తెలిపాడు.

Similar News

News January 8, 2026

ఆదిలాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలుకల్పించాలి: కలెక్టర్

image

నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ అభ్యాసన నైపుణ్యాలు, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు.

News January 8, 2026

PDSU రాష్ట్ర కార్యవర్గంలో ఆదిలాబాద్ వాసులకు చోటు

image

వరంగల్‌లో PDSU రాష్ట్ర 23వ మహాసభలో నిర్వహించారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మడావి గణేశ్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా దీపలక్ష్మీలను ఎన్నుకున్నారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి PDSU పక్షాన పోరాడుతామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News January 8, 2026

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ADB అధ్యక్షుడిగా రంగ ఆనంద్

image

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని ఆదిలాబాద్‌లో నిర్వహించారు. గురువారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ రంగ ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా చిన్మయి వాజే, కోశాధికారిగా దారుట్ల సంజీవ్‌లను నియమించారు. అసోసియేషన్ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.