News January 23, 2025

బోథ్: యువతిని మోసం చేసిన కేసులో ఒకరి రిమాండ్

image

యువతిని పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన నిందితుడిని రిమాండ్ తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. బోథ్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన మల్లెపూల వంశీ కుమార్‌ను బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News November 9, 2025

ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా వరంగల్: కవిత

image

తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిదని, ఈ జిల్లా ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హన్మకొండలోని కాళోజి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ అనగానే తనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గుర్తుకొస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాగృతి నేతలు పాల్గొన్నారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రేపు EVMల డిస్ట్రిబ్యూషన్

image

11న జరిగే జూబ్లీహిల్స్ బైపోల్‌‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. ఉ.7 గం. నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ‘10న సా. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం నుంచి EVM డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 4 EVM మెషీన్లకు 3 అంచెల భద్రత ఉంటుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 45, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ 45, వీడియో టీమ్స్ 8, అకౌంటింగ్ టీమ్‌లు 2 ఉంటాయి’ అని ఆయన వెల్లడించారు.

News November 9, 2025

ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

image

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.