News August 17, 2024

బోధన్ – కాచిగూడ రైలు పున: ప్రారంభం

image

బోధన్, కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు పున: ప్రారంభించారు. మూడు నెలల క్రితం ఈ రైలును రద్దు చేశారు. ఈ రైలు బోధన్ నుంచి కాచిగూడ, మహబూబ్‌గర్ మీదుగా గుంతకల్ వరకు నడుస్తుంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి కాచిగూడ స్టేషన్ మీదుగా 11 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బోధన్‌కు చేరుకుంటుంది.

Similar News

News December 17, 2025

NZB: ఒక్క ఓటు తేడాతో గెలుపు

image

నందిపేట్ మండలం కంఠం సర్పంచ్‌గా సాయినాథ్ గెలుపొందారు. బుధవారం నందిపేట మండలంలో జీపీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థి సాయినాథ్ 712 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇంద్రుడుకు 711 ఓట్లు వచ్చాయి. దీంతో సాయినాథ్ కేవలం ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కంఠం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

News December 17, 2025

నిజామాబాద్ జిల్లా మూడో విడత తొలి ఫలితం

image

కమ్మర్‌పల్లి మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. రాజ రాజేశ్వరి నగర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తైద సుశీల-సాయన్న విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 33 ఓట్లతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

News December 17, 2025

NZB: ఒంటి గంట అప్‌డేట్ 74.36 శాతం పోలింగ్

image

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్‌గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.