News December 29, 2024
బోధన్: కోదండరామ్ను కలిసిన కార్మికులు
బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు శనివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2025
NZB: జాబితాలో నుడా మాజీ ఛైర్మన్ భార్య పేరు
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నుడా మాజీ ఛైర్మన్ భార్య పేరు రావడం బుధవారం నిజామాబాద్లో చర్చనీయాంశంగా మారింది. 43వ డివిజన్లో పాత అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన వార్డుసభ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి జాబితా పరిశీలించారు. ఇందులో నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్ భార్య చామకూర విశాలిని రెడ్డి పేరు (సీరియల్ నంబర్ 106) (ఇటుకల గోడ) రావడంతో అంతా అవాక్కయ్యారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
News January 22, 2025
కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే: కవిత
బీఆర్ఎస్ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని నిజామాబాద్ MLC కవిత అన్నారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం BRS పార్టీదని, BRS కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా BRS కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు.
News January 22, 2025
దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలి: NZB కలెక్టర్
గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను, ప్రత్యేకించి అద్దె ఇంట్లో ఉన్నామని వచ్చే దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.