News November 27, 2024
బోధన్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మెదక్ జిల్లా అల్లాదుర్గం వద్ద హైవే- 161పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్కు చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బోధన్కు చెందిన దేశ్ ముక్ రాజశేఖర్, తండ్రి శివరాజ్, తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి భార్య అరుణ, కూతురు అనన్యతో కలిసి కారులో HYD నుంచి బోధన్కు వెళ్తున్నారు. అల్లాదుర్గం వద్ద కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీ కొట్టడంతో కారు నడుపుతున్న రాజశేఖర్, తండ్రి శివరాజ్ మృతి చెందారు.
Similar News
News November 13, 2025
నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న షీ టీమ్స్

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.
News November 13, 2025
NZB: నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీల నియామకం

తెలంగాణ జాగృతి విస్తరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీలను కవిత ప్రకటించారు. ఈ మేరకు అర్బన్ కమిటీ సభ్యులుగా కరిపే రాజు, యెండల ప్రసాద్, రెహన్ అహ్మద్, ఇరుమల శంకర్, పంచరెడ్డి మురళీ, అంబాటి శ్రీనివాస్ గౌడ్, సాయికృష్ణ నేత, షానావాజ్ ఖాన్, రూరల్ నరేష్ నాయక్, బాణోత్ ప్రేమ్ దాస్, ఆర్మూర్ నుంచి ఏలేటి నవీన్ రెడ్డి, మనోజ్ రావు, ఆజమ్, బాల్కొండకు మహేందర్ రెడ్డి, ధీరజ్లను నియమించారు.
News November 13, 2025
ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై NZB కలెక్టర్ సమీక్ష

NZB కలెక్టరేట్లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి MPDOలు, హౌసింగ్ AEలు, MPOలు, GP కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఇళ్ల నిర్మాణాల్లో వెనుకంజలో ఉన్న వివిధ మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు.


