News June 8, 2024

బోధన్‌: దొంగల హల్‌చల్‌

image

బోధన్‌ పట్టణంలో నెలన్నర కాలంలో దొంగల హల్‌చల్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటి ఎదుట గాని, ఏదైనా దుకాణం, బ్యాంకుల వద్ద ద్విచక్రవాహనం నిలపాలంటే వాహనదారులు భయపడుతున్నారు. పని ముగించుకుని బయటకు రాగానే వాహనం కనిపించకుండా పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు పక్కాగా పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.

Similar News

News October 3, 2024

NZB: ఢిల్లీ పోలీసులమంటూ బెదిరించి.. నిట్టనిలువునా దోచారు!

image

పోలీసులమని బెదిరించి లక్షలు కాజేసిన ఘటన NZB జిల్లాలో జరిగింది. బాధితుల ప్రకారం.. ‘పోలీసులం మాట్లాడుతున్నాం.. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో ఉన్నావు.. అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారు’ అని కామారెడ్డికి చెందిన కిషన్ రావుకు ఫోన్ చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్‌కు రూ.9,29,000 బదిలీచేశాడు. మోసమని గ్రహించి 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 3, 2024

NZB: డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 220 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది.ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్‌కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు.

News October 2, 2024

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్

image

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.