News July 25, 2024
బోధన్ నిజాం షుగర్స్ను తిరిగి తెరిపిస్తాం: డిప్యూటీ CM

తెలంగాణకు గర్వకారణమైన బోధన్లోని నిజాంషుగర్స్ను తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం షుగర్స్ను తెరిపించేందుకు కనీస శ్రద్ధ చూపించలేదని, కానీ తాము త్వరలోనే ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News November 22, 2025
NZB: ‘ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి’

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందికి గురి కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం సహకార సంఘాల ఇన్ఛార్జ్లతో కలెక్టర్ కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
News November 22, 2025
NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్ను డిచ్పల్లి పోలీస్ స్టేషన్కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్ను నిజామాబాద్ 6వ టౌన్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 21, 2025
TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

TU పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.


