News April 5, 2024
బోధన్: బాలుడి అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోసం బస్తీకి చెందిన రేణుక తన కొడుకు నాని(6)ని తీసుకుని రాకాసిపేటలో కూలీ పనికి వెళ్లింది. అక్కడ నాని ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో రేణుక బోధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News November 20, 2025
NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. అయితే ఈనెల 10న కిసాన్ గంజ్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఈనెల15న మృతి చెందాడు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని, ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ నువ్వు సంప్రదించాలని తెలిపారు.
News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్తో సమీక్షలో ఉన్నారు.
News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్లోని కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్తో సమీక్షలో ఉన్నారు.


