News December 8, 2024
బోధన్: 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసిన యువకుడి రిమాండ్

బోధన్ మండలంలో ప్రేమ పేరుతో 17 ఏళ్ల బాలికను మోసం చేసిన యువకుడిని పోలీసులు శనివారం రిమాండ్ చేశారు. రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ.. బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదోతరగతి అమ్మాయికి ఇన్స్ స్ట్రా గ్రామ్ లో యువకుడికి పరిచయమయింది. అది కాస్త ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు.
Similar News
News November 14, 2025
వన్ వే సిస్టమ్ను పరిశీలించిన నిజామాబాద్ సీపీ

నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే దేవీ రోడ్డులో వన్ వే సిస్టమ్ అమలు పరిస్థితిని సీపీ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వన్వే అమలుతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి ప్రత్యక్షంగా ఆరా తీశారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యాలు, బై లెన్లు, గంజ్-గాంధీచౌక్ ప్రాంతాల ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ పాల్గొన్నారు.
News November 13, 2025
భీమ్గల్: రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్గల్ మండలం లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
News November 13, 2025
నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న షీ టీమ్స్

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.


