News February 12, 2025

బోయిన్పల్లి: మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ

image

బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఎల్ఎండికి 2500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పంట పొలాలకు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

మొన్న 90 గంటల పని, భార్యనెంత సేపు చూస్తారు.. నేడు మరో వివాదం

image

వారానికి 90Hrs పని, భార్యను ఎంతసేపు చూస్తారన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి తెరతీశారు. టెకీస్ సహా భారత శ్రామికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరని, పరిశ్రమలకు సవాళ్లు సృష్టిస్తారని చెప్పారు. ‘నేను జాయిన్ కాగానే నాది చెన్నై అయితే మా బాస్ ఢిల్లీకి రమ్మన్నారు. ఇప్పుడు నేను చెన్నై వ్యక్తికి ఇదే చెప్తే రీలొకేట్ అవ్వడానికి ఇష్టపడరు. IT ఉద్యోగులైతే ఆఫీసుకు రమ్మంటే BYE చెప్పేస్తార’న్నారు.

News February 12, 2025

బాదేపల్లి మార్కెట్‌లో నేటి ధరలు

image

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.

News February 12, 2025

NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO

image

నిజామాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.

error: Content is protected !!