News July 26, 2024
బోసిపోతున్న పర్యాటక కేంద్రాలు

అల్లూరి జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలు బోసిపోతున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో గడిచిన రెండు వారాలుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన అరకు, బొర్రా, చపారాయి, కొత్తపల్లి, వంజంగి హిల్స్ పర్యాటక కేంద్రాలు నిత్యం వందలాది మంది పర్యాటకుల సందర్శనతో కళకళ ఉండేవి. ప్రస్తుతం వాతారణం అనుకూలించకపోవడంతో పర్యాటకులు రావడం లేదు. దీంతో కళాహీనంగా దర్శన మిస్తున్నాయి.
Similar News
News November 22, 2025
తాటిచెట్లపాలెం: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని శనివారం రాత్రి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడటంతో తల నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 70 సంవత్సరాలు వయసు పైబడి ఉంటుంది. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు.
News November 22, 2025
తాటిచెట్లపాలెం: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని శనివారం రాత్రి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు చక్రాల కింద పడటంతో తల నుజ్జునుజ్జయింది. మృతుడి వయస్సు 70 సంవత్సరాలు వయసు పైబడి ఉంటుంది. ఫోర్త్ టౌన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు.
News November 22, 2025
విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.


