News February 18, 2025
బ్యాంకర్లు లక్ష్యాలను పూర్తి చేయండి: కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను 100% పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 7, 2025
నేటి ముఖ్యాంశాలు

✸ జగన్కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు
✸ TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి
✸ గ్లోబల్ సమ్మిట్కు ప్రత్యేక విమానాలు: భట్టి
✸ కొడుకు, అల్లుడు, బిడ్డే KCRను ముంచుతారు: రేవంత్
✸ రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల
✸ 95% ఫ్లైట్ కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో
✸ దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా
News December 7, 2025
ప్రైవేటు హాస్పిటల్స్, లాబ్స్ యాజమాన్యంతో DMHO సమావేశం

విశాఖ పరిధిలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్స్,లాబ్స్ యాజమాన్యంతో DMHO జగదీశ్వర రావు శనివారం సమావేశం నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటల్స్ యజమానులు అందరూ హెచ్.పి.ఆర్, హెచ్.ఎఫ్.ఆర్. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలనన్నారు. రిసెప్షన్ వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ నెల 21న పల్స్ పోలియోకు సహకరించాలని సూచించారు.
News December 7, 2025
రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.


