News February 18, 2025

బ్యాంకర్లు లక్ష్యాలను పూర్తి చేయండి: కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను 100% పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

విజయవాడ: పనులు ఆలస్యం.. గడువు దాటినా మార్పు లేదు

image

గన్నవరం విమానాశ్రయంలో రూ. 170 కోట్లతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నూతన టెర్మినల్ భవనం 30 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా 68 నెలలు గడిచినా పనులు ముందుకుసాగడం లేదు. కేంద్ర మంత్రి 2 సార్లు పరిశీలించి హెచ్చరికలు చేసినా మార్పు లేక డిసెంబర్ గడువు కూడా దాటిపోయింది. ఇంకా కనీసం 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టెర్మినల్ ఆలస్యంతో బోయింగ్ సేవలు ప్రారంభం కావడం లేదు.

News December 6, 2025

గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

image

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్‌లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.

News December 6, 2025

కేంద్ర మంత్రి రామ్మోహన్‌పై విమర్శలు.. తిప్పికొట్టిన ఎంపీలు

image

ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు తోటి MPలు మద్దతుగా నిలిచారు. ‘రామ్మోహన్ UDAN పథకాన్ని ప్రోత్సహించారు. దీనివల్ల కొత్త ఎయిర్‌లైన్స్‌కు అవకాశాలు వస్తాయి. ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించారు. సంక్షోభాల్లో విమానయాన సంస్థలను జవాబుదారీగా చేశారు. ప్రయాణికులకు అండగా నిలబడ్డారు’ అని పెమ్మసాని, లావు ట్వీట్లు చేశారు.