News March 29, 2025

బ్యాంకాక్‌లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

image

ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.

Similar News

News October 27, 2025

HYD: కలెక్టర్ల సమక్షంలో నేడు లక్కీ డ్రా

image

HYD, MDCL, RR, VKB జిల్లాల కలెక్టర్ల సమక్షంలో నేడు ఉ.11 గంటలకు మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. శంషాబాద్, సరూర్‌నగర్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ సెంటర్‌లో లక్కీ డ్రా నిర్వహించనుండగా.. సరూర్‌నగర్‌లో 7,845, శంషాబాద్‌లో 8,536, మేడ్చల్‌లో 5,791, వికారాబాద్‌లో 1,808, సికింద్రాబాద్‌లో 3,022, హైదరాబాద్‌లో 3,201, మల్కాజిగిరిలో 6,063 దరఖాస్తులు వచ్చాయి.

News October 27, 2025

చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్.. కేసు నమోదు

image

మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ బారిన పడ్డారు. AI సాయంతో తన ప్రతిష్ఠను దెబ్బ తీసేలా డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇటీవల HYD CP సజ్జనార్‌కూ ఫిర్యాదు చేశారు. కాగా అనుమతి లేకుండా చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని సిటీ సివిల్ కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

News October 27, 2025

CM చంద్రబాబు పల్నాడు పర్యటన షెడ్యూల్ ఇదే.!

image

CM చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా నేడు పల్నాడు (D) వెల్దుర్తి రానున్నారు. షెడ్యూల్‌ను CM కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10:30కి ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. 11. 55 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12 గంటలకు హెలికాప్టర్‌లో వెల్దుర్తి బయలుదేరతారు. ఒంటి గంటకు MLA తనయుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని 1.10కి తిరిగి హెలికాప్టర్‌లో అమరావతి బయలుదేరతారు.