News March 29, 2025
బ్యాంకాక్లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.
Similar News
News November 11, 2025
ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
News November 11, 2025
వరంగల్: నేడు జాబ్ మేళా

జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 11న ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుందని అధికారి సాత్విక తెలిపారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. 18-34 ఏళ్ల వయస్సు గల యువత ఉదయం 11 గంటలకు వరంగల్, ములుగు రోడ్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణానికి హాజరుకావాలని సూచించారు.
News November 11, 2025
కోడిగుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా!

కోడిగుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలకు ఉడికించిన గుడ్లు ఇస్తుంటారు. అయితే, కేవలం గుడ్డులోపల ఉన్న పదార్థం మాత్రమే కాదు.. బయట ఉండే పెంకుతోనూ చాలా లాభాలు ఉంటాయి.- కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మొక్కల కుండీల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. -గుడ్డు పెంకులను మెత్తగా చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరుస్తుంది. – పెంకుల పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి అప్లై చేస్తే దంతాలు మెరుస్తాయి.


