News January 23, 2025
బ్యాంకుల భద్రత అధికారులు దృష్టి పెట్టాలి: సీపీ

వినియోగదారుల సొమ్ము కాపాడేందుకు బ్యాంక్ అధికారులు బ్యాంకు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వినియోగదారుల సొమ్మును భద్రపరచుకున్న సంబంధిత బ్యాంక్ అధికారులు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రై సిటీ పరిధిలో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు.
Similar News
News November 8, 2025
ఖమ్మం: గన్ని సంచుల కొరత లేదు: అదనపు కలెక్టర్

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు గన్ని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే సరఫరా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల ఇళ్లకు సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు.
News November 8, 2025
48 గంటల్లో ఆలయాలు కట్టించాలి.. బండి సంజయ్ వార్నింగ్

రామగుండంలో 46 మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు మసీదులను వదిలి, హిందూ ఆలయాలనే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ‘48 గంటల్లో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలి లేదా మసీదులను కూల్చివేయాలి. లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత నేనే వచ్చి తేలుస్తా’ అని హెచ్చరించారు.
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


