News January 23, 2025
బ్యాంకుల భద్రత అధికారులు దృష్టి పెట్టాలి: సీపీ

వినియోగదారుల సొమ్ము కాపాడేందుకు బ్యాంక్ అధికారులు బ్యాంకు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. వినియోగదారుల సొమ్మును భద్రపరచుకున్న సంబంధిత బ్యాంక్ అధికారులు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ట్రై సిటీ పరిధిలో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ పలు సూచనలు చేశారు.
Similar News
News February 19, 2025
కొవ్వూరు : గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

కొవ్వూరు ఇంటిలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న డేవిడ్ రాజు మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News February 19, 2025
గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News February 19, 2025
కరీంనగర్ : 28 నుంచి LLB పరీక్షలు

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని మూడు సంవత్సరాల LLB పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 5 తేదీ వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు జరగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని, సంబంధిత కళాశాలలో సంప్రదించాలని సూచించారు.