News January 24, 2025
బ్యాంకు లింకేజీ లక్ష్యాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్

జిల్లాలో నిర్దేశించిన బ్యాంకు లింకేజీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో DRDO దత్తారాం, ప్రాజెక్టు మేనేజర్ వెంకట్లతో బ్యాంకు లింకేజీ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన బ్యాంకులు ఈ నెల 29 వరకు 100 శాతం లింకేజీ సాధించాలన్నారు.
Similar News
News October 26, 2025
ADB: గుంజాల శివారులో పెద్దపులి సంచారం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుంజాల గ్రామ శివారులో పెద్ద పులి సంచరించింది. అదివారం పశువుల మేతకి వెళ్లిన రైతులకు పెద్దపులి కంట పడింది. దీంతో రైతులు పరుగులు పెట్టి గ్రామానికి చేరుకున్నారు. భయాందోళన గురైన ప్రజలు అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. పులి అడుగులని నిర్ధారించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర తిప్పేశ్వర్ ఫారెస్ట్ నుంచి తరచూ పులుల రాకతో మండలవాసులు బెంబేలెత్తుతున్నారు.
News October 26, 2025
యాడికి: బైక్ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్మెన్గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్పై మోడల్ స్కూల్కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 26, 2025
ఏయూ విద్యార్థులకు 2 రోజులు సెలవులు

తుఫాన్ నేపథ్యంలో ఏయూ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 27, 28వ తేదీల్లో తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.రాంబాబు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 రోజులపాటు సెలవులు ప్రకటించామని, విద్యార్థులు హాస్టల్స్లో సురక్షితంగా ఉండాలని సూచించారు. అటు అనకాపల్లి జిల్లాలో 29 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.


