News April 30, 2024

బ్యాంక్ ఖాతాకు పెన్షన్లు జమ: జిల్లా కలెక్టర్

image

మే 1వ తేదీన పెన్షనర్ల బ్యాంకు ఖాతాకు పెన్షన్లను జమ చేస్తామని జిల్లా కలెక్టర్ పగిలి షన్మోహన్ పేర్కొన్నారు. ఆధార్ సీడింగ్ అయిన బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తామన్నారు.2,72, 864 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు.79 కోట్ల 87 లక్ష రూపాయలు పెన్షన్ మొత్తం పంపిణీ జరగాలన్నారు. ఇందులో 1,92,021 మందికి బ్యాంకు ఖాతాకి జమ చేస్తారు. 20,843మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News April 18, 2026

సదుం: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో సదుం మండలానికి చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చెరుకువారి పల్లెకి చెందిన ధరణి తమిళనాడు రాష్ట్రం మధురైలో బీటెక్ చదువుతున్నాడు. గత శనివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

News April 18, 2026

కుప్పంలో మరో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

గుడిపల్లి (M) కుప్పిగాని పల్లి, దాసిమానిపల్లి, అంగనామాల కొత్తూరు గ్రామాల పరిధిలో 105 ఎకరాల భూమిని NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. రూ.2550 కోట్ల పెట్టుబడితో కాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పాలసీ (2025-30) కింద ఆమోదించింది

News April 18, 2026

చిత్తూరు: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

image

చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 6 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గంగవరంలో 41.2, రొంపిచెర్లలో 41.1, శ్రీరంగరాజపురంలో 40.1, తవణంపల్లెలో 40.9, విజయపురంలో 40.5, బంగారుపాళ్యంలో 40.0, నగరి, నిండ్రలో 39.8, పులిచెర్ల, శాంతిపురంలో 39.6 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది.