News June 30, 2024
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి: మత్స్యకార జేఏసీ
మత్స్యకార సొసైటీలకు గతంలో వలే కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల అమ్మోరయ్య, ప్రధాన కార్యదర్శి పిక్కి.కొండలరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ మత్స్యకార ఎన్నికల అధికారికి వినతి పత్రం అందిస్తున్నట్లు నక్కపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. చేతులెత్తే పద్ధతి ద్వారా మత్స్యకారులు మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపారు.
Similar News
News September 30, 2024
విశాఖ వేదికగా క్రికెట్ మ్యాచ్
రంజీ ట్రోఫీలో ఆడే ఆంధ్ర జట్టుకు రికీ బుయ్ మరోసారి నాయకత్వం వహించనున్నారు. వచ్చేనెల 11న తొలి మ్యాచ్లో విదర్బతో ఆంధ్ర జట్టు తలపడనుంది. 18న గుజరాత్తో, 26న హిమాచల్ ప్రదేశ్తో ఆంధ్ర జట్టు ఆడనుంది. విశాఖ వేదికగా హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్ జరగనుంది. విశాఖ ప్లేయర్ రికీ బుయ్ కెప్టెన్గా, షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు.
News September 30, 2024
స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎండీగా ఎంఓఐఎల్ ఛైర్మన్ అజిత్ కుమార్ సక్సెనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీల్ప్లాంట్ నూతన సీఎండీగా ఎస్.శక్తిమణి ఇప్పటికే సెలెక్ట్ అయ్యారు. గత సీఎండీ అతుల్ భట్ ఉద్యోగ కాలం నవంబర్ నెలాఖరు వరకూ ఉంది. అంతవరకూ అజిత్ కుమార్ సక్సేనా సీఎండీగా వ్యవహరించనున్నారు.
News September 29, 2024
ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’
ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.