News April 5, 2024
బ్రహ్మంగారిమఠం: వడ దెబ్బతో వృద్ధుడు మృతి

బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన రజకుడు పొంగూరు సుబ్బయ్య(65)అనే వ్యక్తి వడ దెబ్బకు గురై మృతి చెందాడు. గురువారం పింఛను కోసం మల్లేపల్లి సచివాలయం వద్దకొచ్చి వృద్ధాప్య పింఛను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఎండధాటికి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సుబ్బయ్యను శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు 108లో మైదుకూరుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
Similar News
News November 28, 2025
కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.
News November 28, 2025
కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.
News November 28, 2025
కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.


