News February 27, 2025
బ్రహ్మోత్సవాల విధుల్లో అందరి కృషి అభినందనీయం: ఎస్పీ

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని, విధుల్లో అందరి కృషి అభినందనీయమని నంద్యాల జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా అందరి సమన్వయంతో భక్తుల భద్రత, క్షేమమే లక్ష్యంగా బాగా పనిచేసి విజయవంతంగా పూర్తి చేశారన్నారు. బందోబస్తు విధుల్లో జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.
Similar News
News December 4, 2025
రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్లు ఏకగ్రీవం

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 4, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్

షెడ్యూల్ ప్రకారం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, పొటాష్ తదితర రసాయన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అదనపు నిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 4, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి కలెక్టర్

APSSDC ఆధ్వర్యంలో 6వ తేదీ గూడూరు పట్టణంలోని DRW డిగ్రీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15 కంపెనీల ప్రతినిధులు వస్తారని, 700 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


